కరెన్సీ నోట్లతో గణపతి.. 88 లక్షల అలంకరణ!

కృష్ణా జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని 88,88,888 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ అలంకరణ చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మీ ఊరి వార్త మీరే పంపండి!


