గణేశ్ లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు

TG: గతేడాది హైదరాబాద్లోని మైహోం భూజలో రూ.51 లక్షలకు గణేశ్ లడ్డూ దక్కించుకున్న కొండపల్లి గణేశ్పై సైబరాబాద్ EOWలో కేసు నమోదైంది. లడ్డూ వేలం దక్కించుకుని అందరిలో ధనవంతుడనే పేరు సంపాదించుకున్నాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే నెలకు 6శాతం లాభం ఇస్తామని నమ్మించి సిల్వియా దంపతుల నుంచి రూ.31లక్షలు తీసుకున్నాడు. లాభాలు ఇవ్వకుండా అతడు తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు ఆరా తీశారు. అప్పటికే గణేశ్, అతని సహచరుడు ఇళ్లను ఖాళీ చేశారు. మొత్తం ఐదుగురి నుంచి రూ.3.45కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.



