రేవంత్ రెడ్డిపై జానపద కళాకారులు ఫైర్!

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో జానపద కళాకారులకు చేసిందేమీ లేదని సకల కళల JAC చైర్మన్ భూపతి వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో ఆర్టిస్టులు ప్రొటెస్ట్ చేశారు. తెలంగాణ సంస్కృతిని కాపాడిన తమ కోసం ఏం చేశారో గవర్నమెంట్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కళాకారులకు ప్రత్యేక అకాడమీ, నిధులు కేటాయించి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వాలన్నారు. డిమాండ్స్ నెరవేర్చకపోతే కమింగ్ అసెంబ్లీ సెషన్స్ టైమ్లో స్టేట్ వైడ్గా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.



