ఫ్రెండ్స్తో విహారం.. అంతలోనే విషాదం

AP: అస్సాంలోని గువాహటిలో చదువుతున్న కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ కాచన సాయినాథ్ రెడ్డి ఏకైక కుమార్తె, IIT ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చేతన(20) బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లి జారిపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం అధికారులు మృతదేహాన్ని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కుటుంబసభ్యులతో కలిసి వెంటనే అస్సాంకు బయలుదేరారు. చేతన స్వగ్రామం కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి గ్రామం.



