పొట్టేలు – ఒంటరి తల్లికి కొండంత తోడు

రచయిత వివేక్ లంకమల రాసిన మొదటి నవల ‘పొట్టేలు’. ఝాన్సీ పబ్లిషర్స్ ద్వారా ఈ నవల పబ్లిష్ అయ్యింది. నవలలోని ‘పొట్టేలు’ పాత్ర కేవలం ఒక జీవిగా కాకుండా, ఒంటరితనం నుంచి బయటకు తీసుకురాగల నమ్మకం, తోడు, మార్పులకు ప్రతీకగా నిలుస్తుంది. ఒక తల్లి జీవితం విరక్తితో నిండిన సమయంలో ఆ పొట్టేలు తెచ్చిన మార్పు, దాన్ని కాపాడటానికి ఆమె పడే తాపత్రయం పాఠకుడి మనసును తాకుతాయి. రాయలసీమ మాండలికంలో సాగే ఈ నవల పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ధర రూ.150. కొనేందుకు <a href="https://amzn.in/d/0hzA8EPF">లింక్</a>.



