మనుస్మృతిపై రాహుల్ గాంధీ సంచలనం
పూణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళల సాధికారత, స్వేచ్ఛపై మాట్లాడారు. ‘పింజ్రా తోడా’(పంజరాన్ని బద్దలు కొట్టండి) థీమ్తో విద్యార్థులతో మాట్లాడిన ఆయన మహిళలపై మనుస్మృతిలోని భావజాలాన్ని విమర్శించారు. బాల్యంలో స్త్రీ తండ్రికి, యవ్వనంలో భర్తకు, ఆ తర్వాత కొడుకులకు చెందాలని రాశారని, స్త్రీ ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని చెప్పారని ఆయన అన్నారు. ఇలాంటి మాటలు సిగ్గుచేటు అని వివరించారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.


