నిరసనలు విరమించి సహకరించండి: జేపీ నడ్డా

ప్రభుత్వంతో చర్చలు జరపాలని సీజేపీ నిరసనకారుల నుంచి ఈరోజు ఉదయం తనకు ప్రతిపాదన వచ్చిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఉదయం 11:50 గంటల నుంచి సీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. వారితో ప్రాథమికంగా వివరంగా మౌఖిక చర్చ జరిపి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు తనకు లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారని వెల్లడించారు. నిరసనకారులందరూ తమ ధర్నాను విరమించి, పరిపాలనా యంత్రాంగానికి సహకరించాలని అభ్యర్థించారు.



