టెలిగ్రామ్లో జాబ్ ఆఫర్.. భారీ మోసం

TG: టెలిగ్రామ్లో పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో వచ్చిన మెసెజ్ను నమ్మిన HYDలోని దిల్సుఖ్నగర్కు చెందిన విద్యార్థి చరణ్ కౌశిక్ రూ.4.31 లక్షలు కోల్పోయాడు. మొదట గూగుల్ రివ్యూలు పూర్తిచేస్తే పారితోషికం ఇచ్చి నమ్మకం కల్పించిన సైబర్ మోసగాళ్లు, తర్వాత పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు. తొలుత లాభాలు చెల్లించడంతో బాధితుడు కుటుంబసభ్యుల సహకారంతో దశలవారీగా పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాడు. చివరకు రూ.4.31 లక్షలు కోల్పోయిన తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



