APలో 800 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడిదారుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, సుజ్లాన్ సంస్థల ఆధ్వర్యంలో రూ.5,750 కోట్లతో 800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1200 మందికి ఉపాధి, భూములు ఇచ్చిన 1100 మంది రైతులకు 30 ఏళ్లపాటు లీజు ఆదాయం లభించనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే ప్రధాన లక్ష్యమన్నారు.



