నేరాలకు, బాధితులకందే సాయానికీ పొంతనే లేదు

దేశంలో మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి గంటకు సగటున 51 ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదవుతున్నప్పటికీ, నష్టపరిహారం అందుతున్న బాధితుల సంఖ్య ఏడుగురిలో ఒకరి కంటే తక్కువగానే ఉందంటూ ఓ నివేదిక వెల్లడించింది. తీవ్రమైన లైంగిక దాడి కేసుల్లో కూడా అవగాహన లోపం, సంక్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియ, ఫండ్స్ వినియోగంలో నిర్లక్ష్యం వల్ల మెజారిటీ బాధితులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. న్యాయ ప్రక్రియలో ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



