← Back to news

ఒకే కుటుంబంలో ముగ్గురు నీట్ ఎగ్జామ్ పాస్

By RK· 18 Jul 2026
ఒకే కుటుంబంలో ముగ్గురు నీట్ ఎగ్జామ్ పాస్

బిహార్‌లోని సహర్సా జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సిబ్లింగ్స్ నీట్‌-యూజీ 2026 ఎగ్జామ్‌లో ప్రతిభ చాటారు. రజనీశ్‌(3,122), ప్రహ్లాద్(26,751), సాక్షి(9,672) ర్యాంకులు సాధించారు. వీరి తండ్రి రోహిత్ ఆనంద్ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఖరీదైన కోచింగ్‌కు వెళ్లలేక, చిన్న సెంటర్‌లోనే వాళ్లు చదివారు. రోజూ క్రమశిక్షణతో చదువుకుంటూ ఈ విజయం అందుకున్నట్లు తెలిపారు.

More in Education