← Back to news

పంటలసాగులో మార్పులు తప్పవు: గరిమా అగర్వాల్

By DK· 19 Aug 2026· రాజన్నసిరిసిల్ల జిల్లా
పంటలసాగులో మార్పులు తప్పవు: గరిమా అగర్వాల్

TG: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలు, రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి, వైద్య ఆరోగ్య అంశాలపై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ప్రతి గ్రామానికి అవగాహన సామగ్రి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

More in TG