రిపేర్ చేస్తుండగా కదిలిన బస్సు.. మెకానిక్ మృతి

TG: మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. జీడిమెట్ల RTC బస్ డిపోలో బస్సు రిపేర్ చేస్తుండగా ముందుకు కదలడంతో మెకానిక్ మరణించాడు. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. సంతోష్ కుమార్ (39) బస్సు బ్రేక్ రిపేర్ చేస్తుండగా.. డ్రైవర్ అతడిని గమనించకుండా బస్సును ముందుకు నడిపినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు కింద చిక్కుకున్న సంతోష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.



