మెడికోపై కారు ఎక్కించిన యువకులు
AP: రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ని ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమెపై నుంచే కారు పోనిచ్చారు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించగా, బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి స్పీడ్గా కారు నడుపుతుండగాఈ యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.



