రహదారి సమస్య కోసం వినతి ఇచ్చిన గిరిజనులు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి(మం) వలస గురువు రహదారి సమస్యను పరిష్కరించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిసిసి, చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. తాము నిత్యం వినియోగించే రహదారి చాలా కాలంగా సమస్యాత్మకంగా ఉందని తెలిపారు. రహదారి సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.


