మహమ్మద్ ఖదీర్బాబుకు ‘బుక్బ్రహ్మ సాహితీ పురస్కారం’

నాలుగు దక్షిణాది భాషల్లో ఏటా ఒక్కో భాషా సాహితీకారుణ్ని గౌరవించుకునే ఉద్దేశంతో ‘బుక్బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ అందిస్తున్న ‘బుక్బ్రహ్మ సాహితీ పురస్కారాన్ని’ ఈసారి తెలుగు రచయిత మహమ్మద్ ఖదీర్బాబు అందుకోనున్నారు. భారతీయ సాహిత్యానికి ఖదీర్బాబు చేసిన సేవకు ఈ పురస్కారం అందిస్తున్నట్టు ఫెస్టివల్ డైరెక్టర్ సతీష్ చప్పరికె ప్రకటన విడుదల చేశారు. బెంగళూరులో ఆగస్టు 20–23వ తేదీల మధ్య నిర్వహిస్తున్న బుక్బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్లో ఈ పురస్కారాన్ని అందిస్తారు.



