← Back to news

ఇంటి ముందు హత్య.. గ్రామంలో హైటెన్షన్

By dk· 12 Aug 2026· పల్నాడు జిల్లా
ఇంటి ముందు హత్య.. గ్రామంలో హైటెన్షన్

AP: పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో దారుణ హత్య కలకలం రేపింది. ఇంటి బయట నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మాన్యుయేల్(35)పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న గురజాల DSP ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు ముమ్మరం చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.