రైతు బావిలో కదులుతున్న నీరు.. వింతగా చూస్తున్న జనం!
గుజరాత్లోని మోర్బీ జిల్లా విర్పర్దా గ్రామంలోని ఓ బావిలో నీరు దానికదే కదలడం కలకలం రేపింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీటిలో కదలికలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితం కూడా ఇలాగే జరగగా.. గురువారం మధ్యాహ్నానికి కదలికలు ఆగిపోయి, ఆ తర్వాత మళ్లీ కదలికలు వచ్చాయి. దీంతో గ్రామస్థులు బావి వద్దకు చేరుకుని వింతను చూస్తున్నారు. గతంలో భూకంపాలు నమోదైన ప్రాంతం కావడంతో.. దీనికి అదే కారణం అయ్యుండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు GWRI ఎక్స్పర్ట్స్ను విచారణకు ఆదేశించింది.



