లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనాలు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్రోడ్డులో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తాపడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. లారీ బోల్తాపడటంతో అందులోని కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కోళ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. రోడ్డుపై పడిపోయిన కోళ్లను బస్తాల్లో నింపుకుని కొందరు తీసుకెళ్లారు. ప్రమాదంతో ఘాట్రోడ్డుపై కొంతసేపు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.



