భార్యను ఉరితీసి వీడియో తీసిన భర్త

భార్యను హత్య చేస్తూ ఆ దృశ్యాలను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి చూపించిన కిరాతక ఘటన కర్ణాటకలో జరిగింది. బాగల్కోట్కు చెందిన ప్రవీణ్ భార్య భాగ్యశ్రీ(23)పై అనుమానంతో ఆమెను ఉరివేసి చంపాడు. ఆ వీడియోను స్నేహితులకు కూడా పంపాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బాగా చూసుకుంటానని నమ్మించి తీసుకొచ్చిన ప్రవీణ్ అదే రోజే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.



