55 లక్షల తాటి చెట్లు నాటడమే టార్గెట్

AP : తుఫాను గాలులు, తీర ప్రాంత కోతను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తీర ప్రాంతంలో నేచురల్ రక్షణగా 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి గింజలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే 13 లక్షల తాటి గింజలు కలెక్ట్ చేసి, అందులో 1.65 లక్షలు నాటారు. ప్రకృతి విపత్తుల నుంచి మన తీరాన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.





