రాజమండ్రిలో ప్రేమజంట విషాదం

AP: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కాతేరు గామన్ బ్రిడ్జి సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్థానికులు ఓ యువతి మృతదేహంతోపాటు తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకుడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్గా, యువతి శాంతినగర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.



