విదేశీ రెస్క్యు టీంలకు నేపాల్ నో

భారత్ (NDRF బృందాలు), చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమ సొంత డిజాస్టర్ రెస్క్యూ టీమ్లను నేరుగా రంగంలోకి దించుతామని ప్రతిపాదించాయి. కానీ నేపాల్ విదేశాంగ శాఖ ఈ ప్రపోజల్ను తిరస్కరించింది. తమ ఆర్మీ, పోలీస్ బలగాలు అన్వేషణ, రెస్క్యూ చర్యలను సమర్థవంతంగా నిర్వహించగలవని తెలిపింది. 2015లో భారీ భూకంపం వచ్చినప్పుడు అనేక దేశాల నుండి వందలాది రెస్క్యూ బృందాలు ఒకేసారి రావడం వల్ల క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించి పెద్ద గందరగోళం నెలకొంది. ఈసారి ఆ తప్పు జరగకూడదని నేపాల్ భావిస్తోంది.


