← Back to news

రైలులో సీటు కింద సూట్‌కేసుల్లో గంజాయి పట్టివేత

By K. RAJASHEKAR· 21 Aug 2026· Nizamabad, Nizamabad South, Nizamabad
రైలులో సీటు కింద సూట్‌కేసుల్లో గంజాయి పట్టివేత

TG: సాయి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో RPF పోలీసులు, నిజామాబాద్ ఎక్సైజ్ SHO ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు సీటు కింద రెండు సూట్‌కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండగా పట్టుకుని సోదా చేశారు. 24.3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన గణేష్ పోలి(20), దీపక్ సాహు(21)లను అరెస్ట్ చేశారు.

More in Local