దిల్లీలో సంసద్ మార్చ్ ప్రారంభం
దిల్లీలో భారీ వర్షం ఉన్నపటికీ సీజేపీ ఆధ్వర్యంలో సంసద్ మార్చ్ ప్రారంభమైంది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మార్చ్కు ముందస్తు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా విద్యార్థులు ర్యాలీని కొనసాగిస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంట్ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భద్రతా దళాలను మోహరించారు.



