నాగ్పూర్లో 36 టన్నులకు పైగా థాయ్ క్యాట్ఫిష్లు సమాధి
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో అక్రమంగా పెంచుతున్న థాయ్ క్యాట్ఫిష్ చేపలపై ఫిషరీస్ శాఖ పెద్ద ఎత్తున క్రాక్డౌన్ చేపట్టింది. చిచోలి-మహాదూలా ప్రాంతంలోని 11 చెరువుల నుంచి 36 టన్నులకు పైగా నిషేధిత చేపలను స్వాధీనం చేసుకుని వాటిని గుంతలు తీసి పాతిపెట్టారు. థాయ్ క్యాట్ఫిష్ చేపల పెంపకం, విక్రయం చట్టవిరుద్ధమని, ఈ చేపలు స్థానిక జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయని అధికారులు తెలిపారు.


