ఆరుగురు బాలికలకు పాము కాటు.. హెలికాప్టర్లో హాస్పిటల్కు
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జప్టలై గ్రామంలోని గవర్నమెంట్ ఎయిడెడ్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిన్న తెల్లవారుజామున దారుణ ఘటన జరిగింది. నిద్రిస్తున్న ఆరుగురు స్టూడెంట్స్ను పాము కాటేసింది. వీరిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ముగ్గురు బాలికలు చనిపోయారు. మరో ముగ్గురికి ట్రీట్మెంట్ చేస్తుండగా, ఒక బాలిక పరిస్థితి సీరియస్గా మారింది. దీంతో జిల్లా అధికారులు, పోలీసులు ఆమెను బెటర్ ట్రీట్మెంట్ కోసం స్పెషల్ హెలికాప్టర్లో నాగ్పూర్లోని GMC హాస్పిటల్కు తీసుకెళ్లారు.



