ఊహాశక్తిని అడ్డుకోవడమే సెన్సార్షిప్

'నిషేధిత పుస్తకాల లైబ్రరీ' పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సీనియర్ జర్నలిస్టుకె.శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తకాల ప్రాధాన్యతను వివరించారు. సోవియట్ యూనియన్ సమాజం, అక్కడి ఆంక్షలు, ప్రచార ప్రభావాన్ని నవల ఆసక్తికరంగా చూపిస్తుందని తెలిపారు. రాజ్యం ప్రజలు ఎలా ఉండాలో చెప్పడం, వారి ఆలోచనలను నియంత్రించడం వంటి అంశాలను ఇందులో చూపించారన్నారు. సెన్సార్షిప్ ద్వారా ఊహాశక్తిని అడ్డుకునే ప్రయత్నాలను కూడా నవల వివరిస్తుందని చెప్పారు. పాఠకులు, పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ మంచి నవలను అందరూ చదవాలని సూచించారు.



