కాక్రోచ్ పార్టీ సంచలన ప్లాన్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం, CJP తదుపరి లక్ష్యం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలేనన్న చర్చ మొదలైంది. జంతర్మంతర్ ఆందోళనల్లో నీట్ అభ్యర్థులతో పాటు UPSC, SSC, రైల్వే తదితర పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పరీక్షల్లో పారదర్శకత, పేపర్ లీక్ల నియంత్రణ వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా ముందుకు తీసుకురావాలని సీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.



