ఇంట్లో గంజాయి పార్టీ.. అధికారులు వచ్చేలోగా పరార్

TG: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గంజాయి తాగుతున్న యువకులను కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు నర్సాపూర్లోని ఓ హోటల్లో పనిచేస్తూ స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రాత్రి కొందరు యువకులు అతని ఇంట్లో గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన కాలనీవాసులు వారిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకునేలోపే, వారు తప్పించుకుని పారిపోయారు. ఘటన స్థలంలో గంజాయి ప్యాకెట్, కూల్డ్రింక్ బాటిల్స్ లభించాయి. తప్పించుకున్న యువకులను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.



