ఐదేళ్లు ప్రేమించి.. మర్డర్ చేసిన ప్రియుడు!

AP: పల్నాడు జిల్లా కారెంపూడు దగ్గర ఒక దారుణం జరిగింది. హసీనా అనే అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్న బాలసైదు అనే యువకుడు చాకుతో దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత బాడీ మీద పెట్రోల్ పోసి తగలేశాడు. హసీనాకి కొత్తగా జాబ్ రావడంతో తనను కేర్ చేయడం లేదని, ఈ మర్డర్ చేసినట్లు తెలిసింది. హసీనా మిస్సింగ్ అని ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో సెర్చ్ చేసిన పోలీసులు.. కాలువ గట్టు దగ్గర సగం కాలిన బాడీని కనుగొన్నారు. విచారణలో బాలసైదు తనే చంపేసినట్లు ఒప్పుకున్నాడు.



