బీజేపీ గూండాలను పంపిస్తోంది: అభిజిత్ దీప్కే
‘బయటి నుంచి జనాన్ని పంపి నిరసనను భంగపరుస్తున్నారు’ అని సీజేపీ నేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. దిల్లీలోని జంతర్మంతర్ దగ్గర నెల నుంచి కూర్చున్నా ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని, ఇప్పుడు మద్దతు పెరగడంతో బీజేపీ బయటి నుంచి గూండాలను పంపి ప్రజలను ఉసికొల్పుతోందని మీడియాతో చెప్పారు. పోలీసులు రాళ్ల ట్రక్కులు తీసుకొస్తున్నారని, బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసురుతున్నారని అన్నారు.


