క్రికెట్లా ఫుట్బాల్లోనూ భారత్ నంబర్-1 కావాలి
ఇండియా ఫుట్బాల్ జట్టు కూడా క్రికెట్ లాగే వరల్డ్ కప్ ఆడాలని, అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థాయికి ఎదగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ఆకాంక్షించారు. మనదేశంలో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, సరైన శిక్షణ, మౌలికవసతులు కల్పిస్తే ఇండియా కూడా కప్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఎందుకు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆడలేకపోతోందని ప్రశ్నించారు. భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ ఫుట్బాల్కు కూడా దక్కాలని, మనదేశానికి ఎంతో మంది మెస్సీలు, రొనాల్డోల ప్రతిభ ఉన్న ఆటగాళ్లను తయారుచేసే సత్తా ఉందని అన్నారు.



