← Back to news

ఇంటర్ విద్యార్థుల కోసం AP విద్యాశాఖ కీలక నిర్ణయం

By డీకే· 15 Jun 2026· Samayam· అమరావతి
ఇంటర్ విద్యార్థుల కోసం AP విద్యాశాఖ కీలక నిర్ణయం

AP విద్యాశాఖ ఇంటర్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతో పోటీపడేలా ఉత్తీర్ణత శాతం పెంచేందుకు స్పెషల్ క్లాసులు నిర్వహణ, మెటీరియల్‌‌ను అందిస్తోంది. గతేడాది IIT, JEE, NEET, తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను కాస్త ఆలస్యంగా అందజేయగా, ఈసారి మాత్రం ముందుగానే అందజేశారు. ఈ మెటీరియల్ ఉచితంగానే ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే నిపుణులైన సబ్జెక్టు లెక్చరర్లతో మెటీరియల్‌ను రూపొందించారు.

More in Education