ఆపదలో అండగా నిలిచిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్తో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు రమేశ్కు ఆర్థికంగా అండగా నిలిచారు. డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి, చికిత్సకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. రమేశ్ కుటుంబసభ్యులను పరామర్శించి, వైద్యఖర్చుల కోసం రూ.3లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వ ఆరోగ్యబీమా పథకం ద్వారా కూడా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రమేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



