వయసు తేడాతో ప్రేమ కథా?

దర్శకుడు వెంకీ అట్లూరి 'లక్కీ భాస్కర్' సినిమాకు ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. ప్రస్తుతం హీరో సూర్య, మమితా బైజు జంటగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమా తీస్తున్నారు. ఇందులో 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య ఉండే ప్రేమకథను చూపిస్తున్నామని, సూర్య నటనతో ఈ కుటుంబ కథా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు.



