సంసద్ మార్చ్ పీస్ ఫుల్ - షబానా అజ్మీ

సంసద్ మార్చ్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు లేరన్న మీడియా ప్రశ్నలకు నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ మండి పడ్డారు. వై ఓన్లీ సెలబ్రిటీస్. ఇండస్ట్రియలిస్టులు ఒక్కళ్లు రాలేదు. అదెందుకు అడగరు? అని ఎదురు ప్రశ్నించారు. స్టూడెంట్స్ డిమాండ్స్ ను సపోర్ట్ చేయాల్సింది పోయి పక్క దారి పట్టించకండి అంటూ ఫైర్ అయ్యారు. సమస్యను అడ్రస్ చేయమని తాను, తన భర్త ప్రధానికి లేఖ రాశామని నాలుగు రోజుల్లో రిప్లయ్ వస్తుందని చెప్పారని కానీ ఏం రాలేదని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్టూడెంట్స్ తో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని షబానా కోరారు.



