వాగు దాటబోయి ప్రాణాలు కోల్పోయిన మహిళ

TG: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బల్లివాగులో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చామన్పల్లి గ్రామానికి చెందిన మర్సుకోల పారుబాయి మృతి చెందింది. పెన్షన్ డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు.



