కొండపి వద్ద బస్సు ప్రమాదం

AP: ప్రకాశం జిల్లా కొండపి దగ్గర ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. కొండపి నుండి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళ్తుండగా ద్వారకా సీఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఆ టైమ్లో బస్సులో 60 మంది పాసింజర్స్ ఉండగా వాళ్లలో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారిలో కొందరికి స్వల్పగాయాలు కాగా, కొండపి గవెర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. మలుపు వద్ద ఎక్కువ ముళ్లపొదలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించలేదని స్థానికులు అంటున్నారు.



