పులి దాడిలో మహిళ మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది. నిన్న తెల్లవారుజామున కన్హా నేషనల్ పార్క్ సర్కిల్లోని పర్రాపూర్ బైగటోలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుగ్నీ బాయి ధుర్వే (30)పై పులి దాడి చేయడంతో ఆమె తలకు పెద్ద గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేస్ ఫైల్ చేసుకొని, ఫారెస్ట్ ఆఫీసర్స్తో కలిసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.



