తల్లికి వందనం తొలి విడతకు గ్రీన్ సిగ్నల్

AP: స్కూల్కు వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకు ‘తల్లికి వందనం’ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 24న మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి విడతలో రూ.10,049 కోట్లకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో సుమారు 66.9లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. అడ్మిషన్లకు ఇంకా సమయం ఉన్నందున కొత్తగా చేరేవారికి రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పేరేంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.



