23 రోజుల తర్వాత దొరికిన ఏడుగురు జాలర్లు!

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 23 రోజులుగా గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల(Fishermen) ఆచూకీ దొరికింది. ఈ నెల 3న ఓడరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. వెస్ట్ బెంగాల్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. వారి బోటు కూడా అక్కడే లభ్యమైంది. 23 రోజుల తర్వాత సమాచారం రావడంతో ఫామిలీ మెంబెర్స్ ఊపిరి పీల్చుకున్నారు. రేపు సాయంత్రానికి మత్స్యకారులు ఓడరేవుకు చేరుకోనున్నారు.


