మెలోడీ గిఫ్ట్.. స్టాక్ మార్కెట్ లో గందరగోళం

ఇటలీ పర్యటనలో పీఎం మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి పార్లే మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్గా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొన్నారు. దీంతో ఆ షేర్ వాల్యూ 5శాతం పెరిగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మెలోడీ చాక్లెట్లు తయారు చేసేది పార్లే ప్రొడక్ట్స్ అనే కంపెనీ, ఇది అసలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ లో లేదు. ఇన్వెస్టర్లు కొన్న పార్లే ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చేసే కంపెనీ. ఇప్పుడు ఈవిషయం కూడా ట్రెండింగ్ అవుతోంది.



