పండుగ వేళ ధరల షాక్.. సామాన్యుడికి తలనొప్పి!

నిత్యావసర రేట్లు సామాన్యులను కలవరపెడుతున్నాయి. బియ్యం ధరలు భారీగా పెరిగాయి. సన్న బియ్యం కిలో రూ.63 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. షుగర్ రకాన్ని బట్టి కిలో రూ. 42-44 నుంచి రూ. 60-65 వరకు పెరిగింది. పప్పులు, శనగలు, వంట నూనెల ధరలూ పెరిగాయి. కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీనికితోడు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా భారంగా మారాయి. ధరల పెరగడానికి కారణాలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పండుగలు, శుభకార్యాల సమయంలో కామన్ మ్యాన్కు పెరిగిన రేట్లు తలనొప్పిగా మారాయి.


