ఆన్లైన్ గేమింగ్ మోజు..తండ్రినే మోసం చేసిన కొడుకు

ఒకే కొడుకు కావడంతో గారాబంగా పెరిగాడు. ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డాడు. అందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు యూపీకి చెందిన 11వ తరగతి విద్యార్థి కిడ్నాపింగ్ డ్రామా ఆడాడు. ఢిల్లీలో ఉన్న తన లవర్ సాయంతో తను గాయపడినట్టు AIతో ఫోటో తయారు చేసి తండ్రికి పంపాడు. ఫ్రెండ్స్ సాయంతో కిడ్నాపర్లు రూ.లక్ష కావాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. ఆయన పోలీసులకు చెప్పడంతో వాళ్ల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.



