ఈ నెలలో రిటైర్మెంట్.. అంతలోనే ఇంట్లో దారుణం

TG: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని హనుమాన్నగర్లో భార్య రాజమణి, భర్త వెంకటేశంను రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశం ఆసిఫాబాద్లో కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాజమణి సీనియర్ ANMగా పనిచేస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉంది. రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి విషయంపై ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.. పోలీసులు రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



