మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి పువ్వాడ ఫైర్

TG: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో తనపై కాశీం రజ్వీ అంటూ తప్పుడు ప్రచారం చేసినవారు, ప్రస్తుతం తుమ్మలతోపాటు ఆయన కుమారుడి పక్కన ఉంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.



