← Back to news

తాగునీటికే ఫస్ట్ ప్రియారిటీ: CM

By dk· 15 Aug 2026· అమరావతి
తాగునీటికే ఫస్ట్ ప్రియారిటీ: CM

AP: రాష్ట్రంలో నీటి లభ్యత ఆధారంగానే నీటి నిర్వహణ చేపట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పారిశ్రామిక అవసరాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సచివాలయంలో జలవనరుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. లోటు వర్షపాతం నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భజలాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నీటినిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక జలహారతి కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు.

More in AP