బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి: చల్లా ధర్మారెడ్డి

TG: బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాలలకు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తామే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోందని వరంగల్ జిల్లా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో పరకాల పట్టణానికి కొత్తగా చేసిన అభివృద్ధి ఏమిటో ఎమ్మెల్యే ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఇంతకాలం ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.



