ఐదుగురు దొంగల ఆట కట్టించిన మహిళ
మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో ఒక మహిళ ఐదుగురు దొంగల ఆట కట్టించింది. స్కార్పియోలో వచ్చిన ఐదుగురు ముసుగు దొంగలు గోపాల్ జ్యువెలర్స్లో చోరీకి ట్రై చేశారు. షాప్ లాక్ తీసి లాకర్ కట్ చేస్తుండగా మహిళ వారిని గమనించి అడ్డుపడింది. దొంగలపై రాళ్లతో విరుచుకుపడింది. దీంతో దొంగలు పరారయ్యారు. ఈ సీన్ సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.


